17 July, 2026 | 9:01 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

అశ్వాపురం రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి

27-12-2025 09:05 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో డివైడర్ పనులు పూర్తయినా, ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలలుగా రోడ్డును తవ్వేసి వదిలేయడంతో లేస్తున్న దుమ్ము కారణంగా ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని, యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు.