1 September, 2026 | 10:25 PM

శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఫల పంచామృతాభిషేకం

01-09-2026 | 08:23pm

ముకరంపుర,(విజయ క్రాంతి): దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠం పరివార సమేత శ్రీ దుర్గా భవాని దేవాలయం(Sri Durga Bhavani Temple) నగునూరు నందు ఈనెల 3వ తేదీ గురువారం రోజున కృత్తిక నక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి(Sri Subrahmanya Swamy) ఫల పంచామృతాభిషేకం(Phala Panchamrit Abhishekam), విశేష హారతి, ప్రత్యేక పూజలు జరుగుతాయని అలాగే ఈ నెల 4వ తేదీ శుక్రవారం రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా దుర్గా అమ్మవారి కి ఫల పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించ బడుతాయని ఆలయ కమిటీ తెలియజేసింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రమణ్య స్వామి మరియు దుర్గా అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.