1 September, 2026 | 11:15 PM

Breaking News

'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •  

నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ

01-09-2026 | 10:24pm

అలంపూర్: నిరుపేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని(Chief Minister Relief Fund scheme) సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు(MLA Vijayudu) కోరారు. మంగళవారం కర్నూలు పట్టణంలోని తన కార్యాలయంలో రాజోలి మండలం టీ.గార్లపాడు గ్రామానికి చెందిన కేసపోగు రాజేష్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే విజయుడు బాధితుని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం పొందలేని నిరుపేదలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అర్హులైన వారు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో నాయకులు కిషోర్‌, అశోక్‌రెడ్డి, మన శ్రీనన్న, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.