4 July, 2026 | 9:57 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమికి హద్దులు చూపించి రక్షణ కల్పించాలి

03-11-2025 10:12 PM

గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాగా ఎన్ని రోజులు నటిస్తారు

పాపాత్ములను మా ప్రభువే శిక్షిస్తారు

విలేకరుల సమావేశంలో మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాసం కార్యదర్శి కె. అశోక్

మంథని (విజయక్రాంతి): మంథనిలో క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమికి హద్దులు చూపించి రక్షణ కల్పించాలని, గతంలో ప్రభుత్వం క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన 314 సర్వే నెంబర్ లోని 34 గుంటల భూమికి రక్షణ కల్పించాలని మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాసం కార్యదర్శి కె. అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సమాధులకు కేటాయించిన భూమిపై మంథనికి చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఆ పోస్టులో క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ చేసిన వ్యక్తి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం వెళ్తామన్నారు. మంథనిలో బెస్త కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మత పెద్దగా ఉంటూ ఎంతో ఉన్నతమైన వృత్తిని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అ వ్యక్తికి వత్తాసు పలకడం దౌర్భాగ్యం అన్నారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాగా వ్యవహరించే అతన్ని క్రైస్తవ సంఘానికి దూరం పెట్టాలని క్రైస్తవ సమాజాన్ని ఈ సందర్భంగా కోరారు. రాబోయే రోజుల్లో ఆ ఏసుప్రభు వారికి గుణపాఠం చెప్తాడని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు ఐ. డేవిడ్, ఉపాధ్యక్షులు ఎస్. జయరాజ్, సహాయ కార్యదర్శి పి. జోషి, కోశాధికారి ఏ. దైవ కృపాకర్, సభ్యులు ఎం. నవీన్, సిహెచ్ సుదర్శన్, కే జోసఫ్, వి. డేవిడ్, ఎల్. ప్రభాకర్ రాజు, ఎం. జాకర్యా, జె. రాజకుమార్ లు పాల్గొన్నారు.