పద్మశాలి కల్యాణ మండపం పునఃప్రారంభం
ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
సికింద్రాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశాలి సమాజానికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి నెహ్రునగర్లో పున రుద్ధరించిన పద్మశాలి కళ్యాణ మండ పం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆధునిక హం గులతో కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించి పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోప్రత్యేక ఆహ్వానితులు మాజీ పార్లమెంటు సభ్యుడు రాపో లు ఆనంద భాస్కర్, అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగటియ స్వామి, అఖిల భారత పద్మశాలి అన్నసత్రం మార్గదర్శకులు, శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యుడు చిలువేరు కాశీనాథ్, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి, పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్, మాజీ చైర్మన్, అడ్వైజరీ మెంబర్ గుత్తికొండ పాండు, పద్మశాలి-సేవా సమాజం మాజీ ట్రస్టీ,
సలహా సభ్యుడు, పులిజాల రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక, బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మహంకాళి జిల్లా బీజేపీ నేత భరత్ గౌడ్, పద్మశాలి కళ్యాణ మండపం చైర్మన్ నోముల రామ్ ప్రకాష్, వైస్ చైర్మన్ సంగిశెట్టి రవికుమార్, జనరల్ సెక్రటరీ గుత్తికొండ రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎడమ్ శ్రీనివాస్, ట్రెజరర్ గంజి శ్రీనివాస్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




