10 May, 2026 | 5:58 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు

10-05-2026 05:21 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్  గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు నాగిరెడ్డిపేట మండలంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు గోపాల్పేట్ గ్రామంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రానికి సుమారు 8000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారని తెలిపారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీ సహకారం ద్వారానే జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీలకు వస్తున్నటు వంటి నిధుల్లో 90% వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు తెలియజేయడం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం నుండి సుమారు 100 మంది కార్యకర్తలు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లినట్లు మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు.