6 April, 2026 | 4:53 AM

ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన

06-04-2026 01:16 AM

గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శివనగర్‌లోని రామాలయ కళ్యా ణ మండపంలో  నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థుల్లో అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఉచిత అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు, యువత పాల్గొన్నారు. నిరుద్యోగులు కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని అం దించాలనే ఉద్దేశంతో ఏఐ కెరీర్స్, కంప్యూటర్ విజన్, ఐటి రోడ్ మ్యాప్, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సును ఫౌండేషన్ ఉచితంగా నిర్వహించింది.

ఏఐ రంగ నిపుణులు పునిత్ శర్మ, రంజిత్ చిన్నపల్లి, బండి ప్రవీన్కుమార్లు ఏఐ రంగంలో వస్తున్న మార్పు లు, అవకాశాలను వివరించారు.  వరంగల్ యువతకు, విద్యార్థుల కోసం కంప్యూటర్ విద్యను అందిస్తున్న గంట రవికుమార్.. నూ తన టెక్నాలజీని సైతం ఇక్కడి యువత  విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా, ఏఐ టెక్నాలజీని అం దించి విద్యార్థుల నైపుణ్యానికి దోహదపడాలనే లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహించి రాను న్న రోజుల్లో ఉద్యోగ అవకాశాల్లో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఫౌండర్ గంట రవికుమార్, ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.