22 April, 2026 | 1:09 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

ఇంటర్ స్టేట్ షోటొకాన్ కరాటే చాంపియన్ షిప్ 2025 పోటీల్లో ఆర్కిడ్స్ విద్యార్థుల ప్రతిభ

19-11-2025 12:00 AM

కామారెడ్డి, నవంబర్ 18, (విజయక్రాంతి): నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణంలో JKAI  అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర షోటఖాన్ కరాటే ఛాంపియన్షిప్2025 పోటీలలో కామారెడ్డి ఆర్కిడ్స్ హై స్కూల్కు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ విద్యార్థుల్లో అబిష్ , చరణీ గోల్ మెడల్స్ సాధించి పాఠశాల పేరును గర్వంగా నిలబెట్టారు.

అలాగే తమన్నా, జవేరియా సిల్వర్ మెడల్స్ సాధించగా వర్షిత,ఇశాంక్  సాంబశివ మెరిట్ బహుమతులను అందుకున్నారు. ఈ విజయం వెనుక పాఠశాలలో జరుగుతున్న సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమంలో బ్లాక్ సెకండ్ ౄAN ట్రైనర్  సుమాంజలి  పర్యవేక్షణలో విద్యార్థులు పొందిన శిక్షణ కీలక పాత్ర పోషించిందన్నారు. విద్యార్థుల ఈ అద్భుత ప్రతిభను అభినందిస్తూ పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్ సిహెచ్. గోవర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ భూలక్ష్మి  శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. మా విద్యార్థులు చదువుతో పాటు కరాటే, యోగా, క్రీడలు తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ పాఠశాల కీర్తిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో నిలబెడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.