20-02-2026 01:14:37 PM
మర్రిగూడలో 168, 5 సర్వేనెంబర్ల మధ్య గల డొంకను అధికారుల రీ సర్వే
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలోని సర్వే నెంబర్లు 168, 5 మధ్యగల డొంకను శుక్రవారం అధికారులు రీ సర్వే నిర్వహించారు ఇప్పటికే 2016 నుండి పలుమార్లు సర్వే చేసినప్పటికీ అధికారుల తప్పిదం వల్ల గత పది సంవత్సరాల నుండి రీ సర్వే కొనసాగడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల రెవెన్యూ అధికారులు ఈ డొంకను రీ సర్వే చేస్తున్నందువల్ల 47 మందికి నోటీసులు మర్రిగూడ మండల రెవెన్యూ కార్యాలయం నుండి అందజేసినట్లు సమాచారం నేటితోనైనా రైతుల ఇబ్బందులు తొలగేనా ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు