calender_icon.png 23 February, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాహారం తప్పనిసరి

16-02-2025 12:00:00 AM

పిల్లల శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి పోషకాహారం తప్పనిసరి. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం తినిపించాలో తెలుసుకోవడం ముఖ్యం. 

పాలు: ప్రతిరోజూ పిల్లలకు కనీసం రెండు గ్లాసుల పాలు తాగించాలి. పాలతో తయారయ్యే పెరుగు, జున్ను లాంటివి కూడా తినిపించాలి. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, మంచి కొవ్వులు -అధికంగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల్లో దంతాలు, ఎముకలు, కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేస్తాయి. రక్తపోటు, గుండె పనితీరు నియంత్రణలో ఉండేలా సహకరిస్తాయి. 

ప్రొటీన్ పదార్థాలు: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి గుడ్లు, మాంసం, చేపలు, బాదం, బీన్స్, బఠానీలు, సోయా పన్నీర్లను అల్పాహారంలో చేర్చి తినిపించాలి. దీనివల్ల పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, పీచుపదార్థాలు అంది మెదడు, కణజాలం వృద్ది చెందుతాయి. 

పండ్లు: పిల్లలకు తరచూ పండ్లను తినిపించడం వల్ల వారి ఎదుగుదలకు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు అందుతాయి. నారింజ, స్ట్రాబెరీ లాంటి సిట్రస్ జాతి పండ్లను తినిపిస్తే పిల్లలకు సి విటమిన్ లభిస్తుంది. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. -యాపిల్స్, అరటి పండ్లు తినిపించడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు, పోటాషియం’ లభిస్తాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.