calender_icon.png 14 February, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో గెలిచింది కొత్త వారే

14-02-2026 05:17:12 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో 15 వార్డులలో దాదాపు అందరు కొత్త వారే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. 15 వార్డులకు 14 మంది కొత్త వారు కాగా ఒక్కరు (12వ వార్డు అభ్యర్థి పర్వీన్ సుల్తాన ఆరిఫ్ ) మాత్రమే పాతవారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన 11 అభ్యర్థుల్లో 10 మంది కొత్త వారే కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు కొత్త వారే, బీజేపీ నుంచి మొదటి సారి గెలుపొందిన అభ్యర్థి సైతం నూతనంగా ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొన్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ నుంచి పాత అభ్యర్థి ఒకరు కో ఆప్షన్ సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 14 మంది కొత్త వారే విజయం సాధించిన 16న ప్రమాణ స్వీకారం చేసి మున్సిపాలిటీలో అడుగుపెట్టబోతున్నారు.