15 June, 2026 | 11:20 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

20-01-2026 12:29 AM

శామీర్‌పేట్ , జనవరి 19(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డిలతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో అధునాతన సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలన్నారు.అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు వజ్రెష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసర మైపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి  తహసిల్దార్ మహ్మద్ గులాం ఇద్రిస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి , ఆర్టిఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ జాం రవి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ప్రజా ప్రతినిధులు , అధికారులు నాయకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.