16 March, 2026 | 3:52 AM

గోమాతలకు నూతన షెడ్

16-03-2026 12:39 AM

నిర్మాణానికి భూమి పూజ

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి పక్కన ఉన్న శ్రీ గౌరీ లక్ష్మి సరస్వతి గోశాలలో గోమాతల కోసం నూతన భవన నిర్మాణ షెడ్ నిర్మాణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గోపూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గోశాల బాధ్యతలు నిర్వహిస్తున్న ఇట్ట సోమ సుందర్, కాలువ అనిల్ ఆధ్వర్యంలో జరిగింది. భారతీయ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ కోల శివరామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి రమేష్, సామాజిక మహిళ న్యాయవేదిక వరంగల్ అధ్యక్షులు స్వర్ణజ, ఉపాధ్యక్షులు స్వరూప పాల్గొన్నారు. కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. గోమాత సేవే గోవిందుని సేవ అని పేర్కొన్నారు.