1 June, 2026 | 1:20 AM

నరేన్ రాజాది ఉక్కు సంకల్పం

01-06-2026 12:00 AM

చేవెళ్ళ భార్ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్ తాజుద్దీన్

చేవెళ్ళ, మే 31 (విజయక్రాంతి): టిపిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ గా అడ్వకేట్ నరేన్ రాజా అనేరల్లి నియమితులైన నేపథ్యంలో చేవెళ్ళ భార్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ తాజుదిన్ ఆదివారం ఆయన నివాసంలో  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజుదిన్ ఆయనతో అడ్వకేట్ సమస్యలపై కాసేపు చర్చించిన అనంతరం ప్రకటన విడుదల చేశారు. నరేన్ రాజా ది ఉక్కు సంకల్పమని హక్కుల సాధనలో ఆయన సిపాయి పోరాటమన్నారు.

కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పని చేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. పార్టీ నాయకత్వంలో పనిచేస్తూనే అడ్వకేట్ సమస్యలపై పోరాడే వ్యక్తిత్వమున్న నాయకుడున్నారు. మెదక్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమితులవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నరేన్ రాజా కృషిని పార్టీ గుర్తించిందని మునుముందు ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.