కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!
10-05-2026 01:52 PM
- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
బిజినేపల్లి: ఆదివారం విజయక్రాంతిలో ప్రచురితమైన కందనూలులో క్విడ్ ప్రోకో కథనంతో బాధితుల్లో ఆశలు చిగురించి తమ వ్యవసాయ పొలంలో వేసిన అక్రమ వెంచరుకు వచ్చారు. విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రధాన నాయకుడు అడ్డుకుని భూమి కోర్టు కేసులో ఉండగ వెంచరులోకి రావడం తగదంటూ గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకున్నారు. పాలమూరుకు నిర్వాసిత బాధితులు, మండలానికి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుండగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు దాడులను అడ్డుకొని గాయాలతో ఉన్న బాధితున్ని నాగరుకర్నూల్ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకొని పోలీసులకు పిర్యాదులు చేశారు.






