10 May, 2026 | 2:20 PM

Breaking News

అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •  

బాబోయ్ కొండముచ్చులు

10-05-2026 01:56 PM

 ట్రాక్టర్ సౌండ్ వింటే చాలు వాలుతున్న కొండముచ్చులు

 చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు

షాద్‌నగర్,(విజయక్రాంతి): కొడెంగలు.. ఒక గ్రామాన్ని హడలు కొడుతున్నాయి.. ఫరూక్ నగర్ మండలం మధురాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. గ్రామంలో రోజురోజుకు విపరీతమవుతున్న కొండముచ్చుల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం నక్కల అనిత అంజయ్య గౌడ్ పై ఈ కొండముచ్చులు దాడి చేసి గాయపరిచాయి. గ్రామంలో ఇది కొత్త కాదు.. నాలుగు సంవత్సరాల క్రితం ఆమె అత్తమ్మ దన్నారం నక్కల సత్యమ్మ పైన కూడా ఈ కొడెంగలు దాడి చేయడంతో ఆమె చనిపోయింది.

ఇక తరచూ ఎవరు కనిపించిన ఈ దాడులు చేస్తూ ఇబ్బంది గురి చేస్తున్నాయి. ట్రాక్టర్ కనిపిస్తే చాలు వాటి మీద ఎక్కి హల్చల్ చేస్తున్నాయి. పంట పొలాలను పాడు చేస్తున్నాయి. తీవ్రమైతున్న ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి తల్లి పై కూడా ఇవి దాడి చేశాయి. అస్తమానం గ్రామంలో కొడంగల బాధ వర్ణనాతీతం అయింది స్థానిక పాలకులు వీటిని తరిమెందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.