30 July, 2026 | 8:24 PM

Breaking News

శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి   •   ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో రెండో స్థానం   •   వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన   •   నల్లమలలో ప్రత్యక్షమైన నంది విగ్రహం!   •   దంచి కొట్టింది..!!   •   భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించిన మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పుష్పలత

30-07-2026 07:21 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్‌ను మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత గురువారం సందర్శించారు. చిల్డ్రన్స్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు పారిపోయిన ఘటనపై అక్కడి ఇన్‌చార్జ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్‌లో పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, మెనూను పరిశీలించిన పుష్పలత, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ చింతల రాజు మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.