వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన
30-07-2026 08:16 PM
నర్సాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిలిచిన వరద నీటిని తొలగించే పనులను పరిశీలించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తనిఖీ చేశారు. ప్రమాదకర ఇళ్లలో నివసిస్తున్న వారు అవసరమైతే మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, ప్రజలు విద్యుత్ స్తంభాలు, నీటి కుంటలు, శిథిల గోడల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.






