13-02-2026 06:35:49 PM
జవహర్ నగర్ నాయకుల సంబురాలు.
జవహర్ నగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఎల్లంపేట మున్సిపాలిటీలో బిఆర్ఎస్ అభ్యర్థులు సత్తాచాటి ఎదురులేని గెలుపును సాధించారు. ఈ మేరకు శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎల్లంపేటలో పోటీ చేసిన బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో జవహర్ నగర్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిందని ప్రజల్లో ఆదరణ తగ్గలేదు అనేందుకు ఈ ఎన్నికలే నిదర్శనం అన్నారు. గత 10 ఏండ్ల లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ ను అభివృద్ధి పథంలోకి నడిపించారని బిఆర్ఎస్ చేసిన ప్రగతి పనులకు, సంక్షేమానికి, ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, పల్లపు రవి, ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు శోభా రెడ్డి, నాయకులు మహేష్, కాసిం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.