18-04-2025 12:56:12 AM
విల్ జాక్స్ (2/14, 36 పరుగులు)
ముంబై, ఏప్రిల్ 17: ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ మూడో విజయా న్ని నమోదు చేసుకుంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై 4 వికెట్ల తేడాతో ముం బై గెలుపును అందుకుంది. గత మ్యాచ్లో దుమ్మురేపిన హైదరాబాద్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), క్లాసెన్ (37) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికె ట్లు తీయగా.. బౌల్ట్, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విల్ జాక్స్ (36) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రికిల్టన్ (31), సూర్యకుమార్ (26) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో మెరిశాడు. నేడు జరగనున్న మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజా బ్ కింగ్స్ తలపడనుంది.