17 April, 2026 | 12:06 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజీ నియామకం

17-04-2026 01:44 AM

కామారెడ్డి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పాలకమండలి సభ్యులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్  పేరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా కామారెడ్డి జిల్లా చెందిన మహమ్మద్ ఘాజిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యునిగా నియమిస్తూ గురువారం జీవో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ఘాజి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో స్థాపించబడిన తెలంగాణ యూనివర్సిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండటం గర్వకారణమని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అన్ని రంగాలలో కృషి చేస్తూ, యూనివర్సిటీని ఉన్నత స్థానంలో నిలిపేందుకు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని మహమ్మద్ ఘాజి స్పష్టం చేశారు.