30 June, 2026 | 10:03 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు

30-06-2026 09:05 PM

గుండాల,(విజయక్రాంతి): మండలంలో మొబైల్ సిగ్నల్ సమస్యల కారణంగా రైతులు యూరియాను పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మంగళవారం పత్రిక ప్రకటనలో వాపోయారు. యూరియా పంపిణీ కోసం అమలు చేస్తున్న మొబైల్ యాప్ గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా పనిచేయక రైతులు అనేక తంటాలు పడుతున్నారని ప్రభుత్వంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొబైల్ యాప్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు ఆధారంగా యూరియా కట్టాలు అందించే విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరుతున్నామని ప్రకటనలో ఆయన ప్రభుత్వాన్ని కోరారు.