బడంపేటలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
24-02-2026 12:00 AM
జహీరాబాద్, ఫిబ్రవరి 23 : జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలంలో గల బడంపేట గ్రామంలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాణిక్ రావు దేవాలయంలోని శ్రీ రాజన్న స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ మాజీ చైర్మన్ రాజు, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకు సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొని డిమానికరావు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.




