ముర్తుజగుడాలోని 12వ వార్డులో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మొయినాబాద్ మార్చి 19 (విజయ క్రాంతి) మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తుజగూడలోని 12వ వార్డులో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లోనూ వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.
నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ దుబ్బ సోనియా దర్శన్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మొయినాబాద్ కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, విక్రం రెడ్డి, గీతా వనజాక్షి, వాజీద్, నాయకులు జైపాల్ రెడ్డి, నేరెట్ల రాజు గౌడ్, మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదిదారులు పాల్గొన్నారు.




