16 May, 2026 | 5:26 AM

నేడు మంత్రి వివేక్ వెంకటస్వామి రాక

16-05-2026 12:00 AM

గుమ్మడిదల, మే 15: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. సుమారు రూ.15 కోట్లతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీరు సరఫరా, విద్యుత్  దీపాల వంటి పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేయనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు తెలిపారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపారు.