18 August, 2026 | 1:21 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ములుగు ఏసీపీ పుట్టినరోజు వేడుకలు

16-05-2026 01:51 AM

ఇల్లందు టౌన్, మే15, (విజయక్రాంతి):  నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో ములుగు ఏసీపీ ఈ. కిషోర్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంస్థ నేషనల్ చైర్మన్ మహమ్మద్ మొహినుద్దీన్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్తో పాటు వైద్య సిబ్బందిని శాలువాలతో సత్కరించి రోగులకు పండ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో ఎన్హెచ్‌ఆర్సీ అండ్ డబ్ల్యూఈవో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అదేర్ల రాధాగోవిందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కాకటి సతీష్, కనుకుల సత్యం, డేరంగుల శంకర్, మహిళా విభాగం ఇల్లందు మండల అధ్యక్షురాలు మొకాళ్ల శిరీష, కమటం వైశాలి, రాజమున్నూరు విజయ, పామర్తి శ్రావణి, యలగందుల లావణ్య, కుంజా హేమలత, ఖమ్మం జిల్లా కార్యదర్శి మదగాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.