17 June, 2026 | 8:46 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం

09-04-2026 04:56 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): స్థానిక సత్తుపల్లి లో గల ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్తుపల్లి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి నాగేశ్వరావు కి సత్తుపల్లి స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న బస్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా బస్ డ్రైవర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ప్రతి డ్రైవర్ కు ప్రతి సంవత్సరం రెండు జతలు యూనిఫాం అందించాలన్నారు అదేవిధంగా ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం డ్రైవర్స్ కి కల్పించాలని అన్నారు ప్రతి స్కూల్ బస్సులో క్లీనర్స్ను ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా ఏడాదికి సరిపడా వేతనాన్ని డ్రైవర్లకు అందజేయాలని డిమాండ్ చేశారు ప్రతినెల కనీసం ఒక్క సెలవు అయినా ఇవ్వాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కోరారు ఈ సందర్భంగా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.