విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్
07-07-2026 05:07 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం పెద్దకాపర్తి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కాటం వెంకటేశం మంగళవారం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో మెనూ రేట్లను పెంచడంతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠశాలలోనే విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించిందన్నారు. ఈ విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీధర్, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు హరీష్ రెడ్డి, ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.






