calender_icon.png 18 February, 2026 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై వేదికగా మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌కు జాతీయ గౌరవం

18-02-2026 01:21:01 AM

37వ హెవీ వాటర్ దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ పురస్కారం

అశ్వాపురం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): ముంబైలో అణుఊర్జా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 37వ హెవీ వాటర్ దినోత్సవం2026 కార్యక్రమంలో మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్కు 2026 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ పురస్కారం ప్రదానం చేశారు. మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ జి. శ్రీనివాస్ నాయకత్వంలో ప్లాంట్ సాధించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

దేశవ్యాప్తంగా ఉన్న హెవీ వాటర్ ప్లాంట్లలో విశిష్ట ప్రదర్శన కనబర్చినందుకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్లాంట్ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, డీఆర్సీసీ మరియు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహా పరోక్షంగా సేవలందించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు అందుకోవడం ప్లాంట్కు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అణుఊర్జా విభాగం చైర్మన్ అజిత్ కుమార్ మహంతి, మాజీ చైర్మన్ ఏ.ఎన్. వ్యాస్, అణుఊర్జా మరియు అంతరిక్ష కమిషన్ సభ్యురాలు శ్రీమతి శ్రీమాజేన్, భాభా అణు పరిశోధన కేంద్రం డైరెక్టర్ వివేక్ భాసిన్, హెవీ వాటర్ బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సత్యకుమార్, డైరెక్టర్ వి.వి.ఎస్. ప్రసాద్, కె.వి. తాలే తదితర ప్రముఖులు పాల్గొన్నారు.