మండల టాపర్ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు
30-05-2026 10:14 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని నాగుపల్లి గ్రామానికి చెందిన మేకా మాన్విత నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాలలో 571 మార్కులతో మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా విడుదల చేసిన ఆర్జీయుకెటి (RGUKT) బాసర ఫలితాల్లో సీటు సంపాదించడంతో తల్లితండ్రులతో పాటు దమ్మపేట మండల విద్యాశాఖాధికారి జగపతి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి సరళ, గ్రామ ప్రజలు మాన్వితకు అభినందనలు తెలిపారు.






