చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
పాపన్నపేట, మే 28 : చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్పల్లి శివారులోని చెలిమకుంటలో గురువారం చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. నాగ్సాన్ పల్లి గ్రామానికి చెందిన గుండు కిష్టయ్య(48) వ్యవసాయంతో పాటు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి గ్రామ శివారులోని చెలిమ కుంట చెరువులో చేపలు పడుతుండగా కాళ్లకు వల చుట్టుకోవడంతో ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. గురువారం ఉదయం చెలిమకుంటలో అటుగా వెళ్లిన స్థానికులు నీటిలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.






