9 July, 2026 | 1:23 AM

ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

09-07-2026 12:31 AM

శంకర్ పల్లి, జులై 8 ( విజయ క్రాంతి): ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని మోకిల తండాలో  బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చామ్ పే లెయంగి (32) ట్రాన్స్ఫార్మర్ను మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ తగలడం జరిగిందని తెలిపారు. చికిత్స నిమిత్తం నగరంలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందడం జరిగిందని ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. మృతుడికి  వివాహం జరిగింది. 12 సంవత్సరాల బాబు ఉన్నాడు. మృతుడికి మృతుడి బామ్మర్ది సైందు హైబుర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల ఎస్‌ఐ సురేష్ గౌడ్ తెలిపారు.