calender_icon.png 5 February, 2026 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

05-02-2026 12:11:11 AM

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఉరివేసుకుని వ్యక్తి మృతి. ఎల్లారెడ్డి ఎస్త్స్ర మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్,వయసు (35) సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి, చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి, ఎస్‌ఐ మహేష్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మృతునికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్త్స్ర మహేష్ తెలిపారు. మృతుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డి కి తరలించినట్లు ఎస్త్స్ర తెలిపారు.