4 April, 2026 | 2:51 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

మండల మహాసభలను జయప్రదం చేయండి

05-10-2025 04:41 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 7న నకిరేకల్ పట్టణంలో నిర్వహించే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాల్గవ మండల మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని నోముల గ్రామంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమం కోసం కల్లుగీత కార్మిక సంఘం కృషి చేస్తుందన్నారు. ఈ మహాసభలకు గీత కార్మిక సంఘాల ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు గుడు గుంట్ల బుచ్చి రాములు, కార్యదర్శి కొప్పుల అంజయ్య, మండల సహాయ కార్యదర్శి యరకలి అంజయ్య, మండల కమిటీ సభ్యులు పొడిచేటి వీరయ్య, నోముల సొసైటీ అధ్యక్షులు గుండగోని జంగయ్య గౌడ్, ఉపాధ్యక్షులు కొప్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.