14 July, 2026 | 7:20 PM

Breaking News

ఇంటింటి సర్వైతో ఖచ్చితమైన ఓటరు జాబితా   •   ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •  

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం

14-07-2026 06:50 PM

కాప్రా ఎంఈఓ ఆజా మొయినుద్దీన్

జవహర్ నగర్,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే తమ లక్ష్యం అని కాప్రా మండల ఎఫ్ఎసి ఎంఈఓ ఆజా మొహినుద్దీన్ అన్నారు. నూతనంగా ఎన్నికైన కాప్రా మండల ఎఫ్ఎసి ఎంఈఓ ఆజా మోహినిద్దీన్ జవహర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయుల బృందం కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపితం చేయాలని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతకు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు తోడ్పడతానని విద్యార్థులకు క్రీడలతో పాటు సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని చిన్నప్పటినుండే విద్యార్థులు మంచి నడవడికలో నడిచే విధంగా విద్యాబోధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు