2 July, 2026 | 2:21 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

మెట్‌పల్లి నూతన జడ్జీగా మాధవి

01-05-2026 12:37 AM

మెట్ పల్లి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మెట్ పల్లి నూతన జూనియర్ సివిల్ జడ్జి గా వినుకొండ మాధవి పదవీ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా మెట్ పల్లి లో పనిచేస్తున్న నారం అరుణ్ కుమార్ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు కు బదిలీ కాగా, ఖమ్మం జిల్లా మూడవ అదనపు కోర్టు మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్న మాధవి మెట్ పల్లి కోర్టుకి బదిలీపై వచ్చారు.

గురువారం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి పూల మొక్క అందించి వారికి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, క్రీడా కార్యదర్శి నీరటి రమణ, జూనియర్ ఈసి మెంబెర్ మాలేపు సంధ్య రాణి, న్యాయవాదులు కోటగిరి వెంకట స్వామి, చైతన్య, సత్యనారాయణ, మన్నె గంగాధర్ ఉన్నారు.