ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో మద్దిశెట్టి సామేలు సమావేశం
సత్తుపల్లి. ఆగస్టు 26. ( విజయ క్రాంతి): ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ పార్టీ, ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ జిల్లా కమిటీల పనితీరుపై జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జి మద్దిశెట్టి సామేలు జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్చార్జిలు, మీడియా సెల్, యూత్ వింగ్ నాయకులతో సమావేశమై చర్చించారు.
అనంతరం జిల్లా టీమ్కు వచ్చే సోమవారం సత్తుపల్లి పార్టీ కార్యాలయానికి రావాలని మద్దిశెట్టి సామేలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు పుట్టపర్తి హరిబాబు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఈదుల రవి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పలగాని శ్రీనివాస్ గౌడ్. గరిడేపల్లి రవి, వివిధ మండలాల అధ్యక్షులు అసెంబ్లీ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.






