15 June, 2026 | 7:00 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

04-11-2025 06:38 PM

కాటారం (విజయక్రాంతి): పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించాలని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి పాడి రైతులకు సూచించారు. కాటారం మండలం దేవరాంపల్లి, రేగుల గూడెం గ్రామాలలో పశు వైద్యాధికారులు డాక్టర్ ధీరజ్, రమేష్ లతో కలిసి సుమారు 125 గేదెలకు, 74 గోజాతి పశువులకు టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాడి రైతులు తప్పనిసరిగా తమ పాడి పశువులకు ప్రభుత్వం ద్వార ఉచితంగా అందించే గాలికుంట టీకాలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.