గ్రంథాలయాన్ని ప్రారంభించాలని వినతి
లక్షెట్టిపేట, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించాలని కోరుతూ శని వారం భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వెంకట్రావుపేట పంచాయతీ సెక్రెటరీ సింగతి వంశీకృష్ణకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తున్నందున గ్రంథాలయాన్ని త్వరగా ప్రారంభించాలని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి, పోలీస్ అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెన్న అంజి, నాయకులు కాండ్రపు వంశీకృష్ణ, ఇండ్ల గంగన్న, జాడి కిషన్, కోన నరేష్, జాడి దేవేందర్, కోన హరీష్, సిల్వేరి సాయికిరణ్, బండి సంజీవ్, తదితరులున్నారు.






