13-02-2026 12:50:59 AM
కొలంబో, ఫిబ్రవరి 12 : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో శ్రీలంక జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. గ్రూప్-బీలో భాగం గా ఒమన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక పూర్తి ఆధి పత్యం చెలాయించగా.. ఒమన్ తేలిపోయింది. కనీస పోటీ కూడా పోటీనివ్వలేక పోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసింది. అనంతరం ఒమ న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 120 ప రుగు చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నదీం మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో గ్రూప్ -బీ నుంచి సూపర్ -8 అవకాశాలను మెరుగుపర్చుకోగా.. ఒమన్ వరుస ఓటముల తో ఇంటిదారి పట్టేందుకు రెడీ అయింది.