22 April, 2026 | 4:45 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన

22-04-2026 02:59 PM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఆధారాలు సమర్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission) తెలంగాణ హైకోర్టు తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీలకు ఊరట లభించింది. కోర్టు తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై సరైన విచారణ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.