2 September, 2026 | 11:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

28-06-2026 | 11:41am

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 0-5 ఏళ్లలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. బోరబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వద్ద పోలియో కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భారత్ 2014లోనే పోలియోరహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొన్ని దేశాల్లో ఇంకా ప్రభావం ఉండటంతో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హెల్త్ కమిషనర్ సంగీత, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్‌వోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.