2 September, 2026 | 10:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

28-06-2026 | 11:58am

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని,  0-5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా  పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

పోలియో చుక్కలు చిన్నారులకు జీవితాంతం రక్షణ కవచంలా నిలుస్తాయని, చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి, బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతుందన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం, పోలియోరహిత భారతదేశం కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.