కేసీఆర్, రేవంత్రెడ్డి కాంప్రమైజ్డ్ పాలిటిక్స్
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కేసీఆర్, రేవంత్ రెడ్డి కాంప్రమైజ్డ్ పాలిటిక్స్కు కాళేశ్వరమే తార్కాణమని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బుధవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేస్తూ కాళేశ్వరంపై హైకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ఫెయిలయ్యారని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తేనే అర్ధమవుతోందన్నారు. కేసీఆర్ను కాపాడటానికే రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నార న్నారు.
రూ.లక్ష కోట్ల కాళేశ్వరం స్కాంపై కాకుండా రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడం కూడా అందులో భాగమే అన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన పన్నాగమేనని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళుతున్నాయి... ఇక్కడ కేసులు క్లోజ్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి క్విడ్ ప్రో కో వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.






