రాష్ట్రంలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి
15-03-2026 03:28 PM
హైదరాబాద్: మూసీపై ఇప్పటి వరకు డీపీఆర్ ను ప్రభుత్వం విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పూర్తి డీపీఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని, మూసీ భూములను ప్రపంచ బ్యాంక్ కు కట్టబెట్టే యత్నమని, రాష్ట్రంలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైడ్రాను పెట్టి ముఖ్యమంత్రి ఆరాచకం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. మూసి అభివృద్ధి భాగంగా ఫేజ్ 1 కోసం ఆరు నెలల క్రితం ఫ్రీ ఫీజబులిటీ రిపోర్టులో 5,641 కోట్లు ఖర్చు అవుతుందని ప్రకటించిన ప్రభుత్వం, ఆరు నెలల తర్వాత దాదాపు రూ.1400 కోట్ల అంచనా ఎందుకు పెరిగిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.




