4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రామప్పలో కార్తీక శోభ

18-11-2025 12:36 AM

భక్తుల ప్రత్యేక పూజలు, భజనలు

వెంకటాపూర్(రామప్ప), నవంబర్17(విజయక్రాంతి):కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు.

ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు శివలింగానికి అభిషేకాలు, అలంకారాలు, ప్రత్యేక ఆర్చనలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కమీషనర్ దేవాదాయ, ధర్మాదాయ హైదరాబాద్ వారి ఉత్తర్వుల మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి బిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తి గీతాల భజన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు.

ఆలయ ప్రాంగణంలో భక్తి మయంగా భజనలు, శివుని నామస్మరణం సందడి చేసింది. స్వామివారి సన్నిధిలో భక్తులు దీపారాధన చేస్తూ తమ కోరికలు తీర్చమని వేడుకున్నారు. కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా కనిపించింది. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టూరిజం పోలీసులు విధులు నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు వేళ రామప్పలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిబ్బందీలు, టూరిస్ట్ పోలీసులు, గైడ్స్, భక్తులు పాల్గొన్నారు.