30 June, 2026 | 11:00 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కబీర్ వీడియో కలకలం

11-04-2026 12:00 AM
  1. ఎన్నికల వేళ ఏజేయూపీ అధినేత వీడియో వైరల్
  2. బీజేపీతో వెయ్యి కోట్ల డీల్ కుదిరిందని టీఎంసీ ఆరోపణలు
  3. ఏజేయూపీతో పొత్తు రద్దు: ఎంఐఎం

కోల్‌కతా, ఏప్రిల్ ౧౦: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) శుక్రవారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధినేత హుమాయున్ కబీర్ మైనార్టీల ఓట్లను మళ్లించేందుకు బీజేపీతో చేతులు కలిపి కుట్ర చేశారని, అందుకు కబీర్ భారీ మొ త్తంలో డబ్బు తీసుకున్నారని, కుట్రలో ప్రధా ని కార్యాలయం (పీఎంవో) భాగమైందనేది వీడియో సారాంశం.

ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో కబీర్ సమన్వయం చేసుకోవాలని కూడా వీడియో ఫుటేజీలో ఆడియో వినిపించింది. అంతేకాదు.. ‘ముస్లింలను మోసం చేయడం సులభం.. అందుకు బాబ్రీ మసీదు కూల్చివేతే పెద్ద ఉదాహరణ’ అని కబీర్ వ్యాఖ్యానించినట్లు ఉంది. ఈ వీడియోపై టీఎంసీ నేతలు తీవ్రమైన ఆరోప ణలు చేశారు. తమ పార్టీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ కుట్ర వెలుగు చూసిందని వెల్లడించారు.

ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి కబీర్ రూ.200 కోట్లు ముందస్తుగా పొందినట్లు ఆరోపించారు. బీజేపీతో కబీర్ కుదుర్చుకున్న ఒప్పందం దాదాపు రూ.1000 కోట్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశా రు. వారి వ్యాఖ్యలను కబీర్ ఖండించారు. ఏఐని వినియోగించి టీఎంసీ నేతలు తనపై కుట్రలు పన్నారని వ్యాఖ్యానించారు.

2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తా ను టచ్‌లో లేనని తెలిపారు. కబీర్ వీడియో వైరల్ అయిన నేపథ్యం లో ఏజేయూపీతో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం స్పందించింది. పొత్తును నిర్దంద్వంగా రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.