11 April, 2026 | 3:54 AM

జస్టిస్ యశ్వంత్‌వర్మ రాజీనామా

11-04-2026 12:00 AM

రాష్ట్రపతికి లేఖ సమర్పణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, తనపై అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాయడం, పార్లమెం టు ఉభయసభల్లోనూ ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని చేసిన తరుణంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్‌వర్మ శుక్రవారం రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. గతంలో ఢిల్లీలోని తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.