17 May, 2026 | 12:53 PM

నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష

17-05-2026 11:35 AM

హైదరాబాద్: దేశంలో ప్రతిష్ఠాత్మక ఐఐటీ  (Indian Institute of Technology) రూర్కీ, జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షను ఆదివారం భారతదేశంలోని 221 నగరాల్లో రెండు అంతర్జాతీయ కేంద్రాల్లో నిర్వహిస్తుంది. బీటెక్ (BTech), బీఎస్, బిఆర్చ్ కోర్సుల ప్రవేశ పరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. పేపర్ 1 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ సంఖ్య, పుట్టిన తేదీని ఉపయోగించి, అధికారిక వెబ్‌సైట్ నుండి తమ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డు మే 11న విడుదల చేయబడింది.