భీకర యుద్ధం.. 1,900 మందికిపైగా ఇరాన్ సైనికులు మృతి
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం పదకొండవ రోజు కొనసాగుతోంది. ఇరాన్ లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాదాపు 1,900 మంది శత్రు సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ప్రతిదాడిగా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల దాడి చేసింది. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ జరిపిన దాడుల్లో మరో అమెరికా సైనికుడు(American soldier) మృతి చెందాడు. బెహ్రెయిన్ లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ల దాడి చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధం దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) పుతిన్ తో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్, పుతిన్ దాదాపు గంటసేపు ఫోన్ లో కీలక అంశాలపై చర్చించారు.
అమెరికా, ఇరాన్(America, Iran) మధ్య జరుగుతున్న యుద్ధంపై ఇరువురు నేతలు చర్చించారు. యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించారు. యుద్ధాన్ని దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవటంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధం, వెనెజువెలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు క్రెమ్లిన్(Kremlin) పేర్కొన్నారు. ఈ చర్చలు యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయని రష్యా వెల్లడించింది.




